బెంగళూరు, జూన్ 15: కర్ణాటకలో ‘హిందీ’ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(బెంగళూరు సౌత్) డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదమైంది.
సర్క్యులర్పై కన్నడ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ టీఎస్ నాగభరణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిపార్ట్మెంట్కు లేఖ రాశారు. అయితే, కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అటువంటి సూచనలు చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ బుధవారం పేర్కొన్నారు.