చెన్నై, జూన్ 6: హిందీ నేర్చుకొంటే తమిళుల హోదా శూద్రులుగా మారుతుందని తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. హిందీ భాష మాట్లాడుతున్న రాష్ర్టాలు అభివృద్ధి చెందలేదని, మాతృ భాష వాడుతున్న రాష్ర్టాలే అభివృద్ధి చెందాయని తెలిపారు. హిందీ భాషను తప్పనిసరి చేసి మళ్లీ మనుధర్మాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.