న్యూఢిల్లీ, మార్చి 7: పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీఓకే) కోఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో విద్యార్థినులు, మహిళా టీచర్లు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని కొత్త నిబంధనను స్థానిక ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఎవరైనా హిజాబ్ ధరించకుండా విద్యాసంస్థల్లోకి అడుగుపెడితే చర్యలు తీసుకోవాలని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు అందాయి.
ఈ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు తప్పుపడుతున్నారు.