Soft Drinks | లక్నో, అక్టోబర్ 20: నిత్యం శీతల పానీయాలను వినియోగించడం వల్ల ఎముకలు పెళుసుగా మారుతాయని ఆర్థోపెడిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రమంగా ఇది 40-50 ఏండ్ల వయసు వారిలో బీఎండీ (బోన్ మెటీరియల్ డెన్సిటీ) తగ్గుదలకు దారితీస్తుందని, ఆ తర్వాత అస్థియోపోరోసిస్ (ఎముకలు బోలుగా మారే) వ్యాధిగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
రోజూ శీతల పానీయాలు సేవించడం వల్ల ఎముకల్లో పగుళ్లు ఏర్పడే ముప్పు పెరుగుతుందని, ఇది వయోజనులకు అధికంగా ఉంటుందని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షా వలీయుల్లా తెలిపారు. చైనాలో 17 వేల మందికిపైగా వ్యక్తులపై ఏండేండ్లపాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్టు ఆయన వెల్లడించారు.