జైపూర్: ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో దాయాది ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొన్నది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో దయాది దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్ ప్రకంటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీచేశారు.
పాకిస్థాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు. ఇక ఇండియన్ ఎయిర్ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రొటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతోపాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కట్ వరకు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఎయిర్ పొట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బర్మేర్లో జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. పోలీసులు, రైల్వే ఉద్యోగుల సెలవులను రద్దుచేశారు. ఇక సరిహద్దుల్లోని గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్పూర్లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని (Blackout) ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమతుంది.
ఇక పంజాబ్లో పోలీసుల సెలవులను రద్దుచేశారు. ప్రజలు గుమికూడకుండా నిషేధం విధించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం భగవంత్ సింగ్ మాన్ రద్దుచేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.