Mumbai | ముంబైలో హైఅలర్ట్ విధించారు. ఖలిస్తానీ ఉగ్రవాదులు ముంబైను టార్గెట్ చేస్తూ దాడులు దిగొచ్చని సమాచారం రావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. పోలీసులందరూ శుక్రవారం ఆన్డ్యూటీలోనే ఉంటారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక ముంబై మహా నగరంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లైన దాదర్, బాంద్రా చర్చ్గేట్, సీఎస్ఎంటీ, కుల్రాతో సహా మరికొన్ని రైల్వే స్టేషన్లపై గట్టి నిఘా పెట్టామని, తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు.