Hemangi Sakhi | వారణాసి, ఏప్రిల్ 8: లోక్సభ ఎన్నికల్లో ఈసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ప్రముఖ ట్రాన్స్జెండర్, శ్రీకృష్ణుడి పరమ భక్తురా లు మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతున్న అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) వారణాసి నియోజకవర్గంలో మోదీపై ఆమెను తమ అభ్యర్థిగా ని లబెట్టింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అ భ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రా య్ మరోసారి పోటీ చేస్తున్నారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరుగనున్నది.
హేమాంగి సఖి నేపథ్యం ఇదీ..
భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రా న్స్జెండర్ కథకురాలిగా ఖ్యాతి పొందిన హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి ఓ ఫిలిం
డిస్ట్రిబ్యూటర్ కావడంతో కుటుంబం ముంబైకి వలస పోయింది.