Helicopter Crash | ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్ కుప్పకూలినప్పుడు అందులో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలతో బయటపడ్డ ఇద్దరు పైలట్లను చికిత్స కోసం రామకృష్ణ హాస్పిటల్కు తరలించగా, మృతి చెందారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే సీనియర్ పోలీసు, పౌర అధికారులు విమానాశ్రయాన్ని సందర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. మరణించిన పైలట్లు కెప్టెన్ గోపాలకృష్ణ పాండా, ఏపీ శ్రీవాత్సవ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం పట్ల ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘెల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు పైలట్లకు తీవ్ర సంతాపం తెలిపారు. మరణించిన పైలట్ల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థించారు.