న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అదేవిధంగా కొన్ని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో జూలై 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.