Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పరిధిలో గల అమర్నాథ్ దేవాలయం వద్ద కుంభ వృష్టి కురుస్తున్నది. అమర్నాథ్ దేవాలయ ప్రాంగణంలోని గుహ సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది. ఒక్కసారిగా వరద విరుచుకు పడటంతో యాత్రికులు కకావికలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల్లో చిక్కుకుని ఐదుగురు యాత్రికులు మరణించినట్లు తెలుస్తున్నది. మరికొందరి ఆచూకీ గల్లంతైందని తెలుస్తున్నది. సాయంత్రం 5.30 గంటల సమయానికి అక్కడ వేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లు సమాచారం. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు సైనికులు, ఐటీబీపీ జవాన్లు రంగంలోకి దిగారు.
గుహ పరిసరాల్లో 12 వేల మంది యాత్రికులు ఉన్నారని తెలుస్తున్నది. అకస్మాత్తుగా వరద రావడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. గత నెల 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
#WATCH | J&K: Massive amount of water flowing turbulently after a cloud burst occurred in the lower reaches of Amarnath cave. Rescue operation is underway at the site pic.twitter.com/w97pPU0c6k
— ANI (@ANI) July 8, 2022