న్యూఢిల్లీ: కోస్టల్ ఆంధ్రా(Coastal Andhra) మండిపోతోంది. భానుడి ప్రతాపంతో ఆ ప్రాంతం ఉడికిపోతోంది. రెండు రోజుల పాటు కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో భారీ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఇవాళ భారతీయ వాతావరణ శాఖ హెచ్చించింది. ఇవాళ, రేపు కోస్తా ఆంధ్రా జిల్లాల్లో హీట్వేవ్ వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే అత్యధిక స్థాయిలో టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ఇవాళ రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదు అయ్యింది. ఇక రానున్న అయిదు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది.