న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మానసిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా చిన్న వయస్సులోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయని ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన కార్డియాలజిస్టు అశ్వనీ మెహతా చెప్పారు. మానసిక సమస్యలకు, గుండెపోటుకు దగ్గరి సంబంధం ఉందన్నారు. కానీ ప్రజలు శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకొన్నంతగా మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరని పేర్కొన్నారు. ఇండియాలో కొంత కాలంగా 30-40 ఏండ్ల వయసు ఉన్నవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారని చెప్పారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్గా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.