Voting | ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు విడతల్లో ఎన్నికలు జరుగతాయని, మార్చి 10 న తుది ఫలితాలు వెలువడతాయని సుశీల్ చంద్ర ప్రకటించారు. అయితే కోవిడ్ రహిత పోలింగ్ను నిర్వహించడానికే తాము ప్రయత్నాలు చేస్తున్నామని సుశీల్ చంద్ర ప్రకటించారు. మరోవైపు నిపుణులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని సూచిస్తున్నారు.
ఆయా రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలు, సభల్లో ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండకుండ చూసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేశాయని, వాటిని కచ్చితంగా పాటించాలని, లేదంటే కష్టమేనని తీవ్రంగా హెచ్చరించారు.
అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కుండబద్దలు కొడుతున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూసుకోవాలని, మాస్క్ ధరించకుండా వచ్చే వారిని ఓటింగ్కు అనుమతించకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యావశ్యకమని, అయితే అంతే స్థాయిలో నిబంధనలు కూడా పాటించాలని నిపుణులు కోరుతున్నారు.