లక్నో: బైక్పై వెళ్తున్న ఒక హెడ్మాస్టార్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. రోడ్డుపై పడిన అతడి మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ (Shocking Video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సుఖ్పురా గ్రామంలోని రోడ్డుపై ఒక వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఆ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అయితే డ్రైవర్ స్కూల్ బస్సును ఆపకుండా ఆ వ్యక్తి మీదుగా నడిపాడు. దీంతో ముందు, వెనుక చక్రాల కింద నలిగిన అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని ప్రభుత్వ జూనియర్ హైస్కూల్కు చెందిన హెడ్మాస్టార్ అరవింద్ కుమార్ ఉపాధ్యాయ్ (55)గా గుర్తించారు.
కాగా, ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బైక్ను ఢీకొన్న తర్వాత స్కూల్ బస్సు స్లో అయ్యింది. అయితే బస్సును ఆపకుండా దాని కిందపడిన హెడ్మాస్టార్ మీదుగా నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు.
live accident
The school bus ran over a bike rider, the bike rider died on the spot. The incident is of Ballia.#UttarPradesh #india #RoadSafety #RoadAccident #accident #viralvideo pic.twitter.com/isrvcdsKJv
— Siraj Noorani (@sirajnoorani) August 21, 2023
ये एक्सीडेंट नहीं, मर्डर है. (LIVE VIDEO)
बस की रफ्तार काफी कम थी, बाइक सवार को बचाया जा सकता था.
लेकिन ड्राइवर ने ना सिर्फ आगे के पहिए के नीचे उसे दबाया, फिर दूसरे पहिये से भी उस आदमी को कुचला और फिर भाग निकला.
यूपी के बलिया की घटना. pic.twitter.com/c8PZAaQTpA
— Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 21, 2023