Jammu | ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న ఓ వ్యక్తిని (Overground Worker) భద్రతా దళాలు ఆదివారం అరెస్టు చేశాయి. అతని నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్స్తో పాటు పిస్టల్స్ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తిని ఖమరుద్దీన్ అని.. టీచర్గా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. మండి ప్రాంతంలోని హరి బుధా గ్రామంలో నివసిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన 39 ఆర్ఆర్, రోమియో ఫోర్స్ ఆఫ్ 6 సెక్టార్తో పాటు పోలీసులు, ఎస్ఓజీ ఆదివారం పూంచ్ జిల్లాలోని సురన్కోట్ ప్రాంతంలోని హరి బుధాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సమయంలో, ఉగ్రవాదులతో కలిసి ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పని చేస్తున్న ఖమరుద్దీన్ను అరెస్టు చేశారు. వృత్తి రీత్యా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. విచారణలో పాక్లో తయారైన పిస్టల్తో పాటు రెండు చైనీస్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో విధ్వంసం చేసేందుకు వీటిని సిద్ధం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. శనివారం రియాసి జిల్లాలోని డల్లాస్ బర్నెలీ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాన్ని కూల్చివేశారు. రెండు ఐఈడీలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
#WATCH | In a joint operation, launched by the 39 RR of 6 Sector, Romeo Force with JKP and SOG Poonch in Hari Budha, a registered Over-Ground Worker (OGW) named Qamaruddin who is the headmaster in school is caught with a foreign-made pistol and grenades in his house. The… pic.twitter.com/VipNNGzEFQ
— ANI (@ANI) April 21, 2024