ఝజ్జర్ : ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ చీఫ్(INLD Chief), మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో 12 మందిపై కేసు బుక్ చేశారు. దాంట్లో హర్యానా మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్పై కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేపై కూడా కేసు బుక్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదు. వాహనంలో ప్రయాణిస్తున్న నఫే సింగ్ రాథీతో పాటు జై కిషన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బహదూర్ఘర్ పట్టణంలోని బారాహి లెవల్ క్రాసింగ్ వద్ద కారులో వచ్చిన వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ అటాక్లో రాథీ గన్మెన్లు గాయపడ్డ విషయం తెలిసిందే. ఎస్యూవీలో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేపై చాలా సమీపం నుంచి ఫైరింగ్ చేశారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పారిపోయారు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.