పాట్నా: తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడేదని, ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీ నుంచి బీహార్కు వచ్చిన ఆయన ఆరేండ్ల తర్వాత తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్న తారాపూర్, కుశ్వేశ్వర్ ఆస్థాన్లో చివరి రోజున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం ఈ రెండు నియోజకవర్గాల్లో హెలీకాప్టర్లో పర్యటించి స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘బీహార్ ప్రజలు తేజశ్విని ముఖ్యమంత్రిగా నిర్ణయించుకున్నారు. అయితే మోసం, అవకతవకల ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడింది. నేను జైళ్లో కాకుండా బయట ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు’ అని తారాపూర్లోని ఈద్గా మైదాన్లో అన్నారు. స్థానికుల కరతాళధ్వనుల మధ్య ఏడు నిమిషాలపాటు మాట్లాడారు.
బీహార్లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం అని పిలిచే బీజేపీ, రాష్ట్రం, కేంద్రంలో వేర్వేరు దిశల్లో ఇంజిన్లను లాగడం వల్ల అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైందని లాలు విమర్శించారు. ‘ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిమజ్జనం ఇస్తామని మేము చెప్పాను. నేను ఆయనను కాల్చివేయగలనని నితీష్ చెబుతున్నాడు. నేను అలా ఎందుకు చేస్తాను? అతనే చనిపోతాడు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
మద్యం అమ్మకాల నిషేధంపై మాట్లాడుతూ.. ‘బీహార్లో ఎలుకలు మద్యం తాగుతాయి’ అని లాలు ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరనంటూనే ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ బీహర్కు ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారంటూ మండిపడ్డారు. ఆర్జేడీకి ఓటు వేసి ఎన్డీయేను ప్రభుత్వం నుంచి దించాలని ప్రజలను కోరారు.