న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పెళ్లికి కొన్ని గంటల ముందే ఓ జిమ్ ట్రైనర్(Gym Owner) హత్యకు గురయ్యాడు. 29ఏళ్ల గౌరవ్ సింఘాల్ని అతని తండ్రి రంగలాల్ చంపినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న తండ్రిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌరవ్ తండ్రిని అవమానించేవాడని, అది తట్టుకోలేక అతను కొడుకును కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు చెప్పారు. ఫిట్ బాక్స్ అనే జిమ్ను గౌరవ్ నడిపేవాడు. అతని ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉన్నాయి.
అయితే పెళ్లికి సిద్ధం అవుతున్న గౌరవ్ అనుకోకుండా హత్యకు బలయ్యాడు. ఒకవైపు ఇంట్లో అతిథుల సమక్షంలో పెళ్లి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే గౌరవ్ ఆచూకీలేకండా పోయాడు. అతని కోసం చాలా సేపు గాలించారు. రాజూ పార్క్లో అతను రక్తపుమడుగులో కనిపించాడు. అతని మరణించినట్లు పోలీసు కమీషనర్ అంకిత్ చౌహాన్ తెలిపారు. ఆ సమయంలో పరారీలో ఉన్న తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.