వారణాసి: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో నిర్వహించిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదికను బహిర్గతపరచడంపై వారణాసి జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పబోతున్నది. సీల్డ్ కవర్లో ఇచ్చిన ఈ నివేదికను కనీసం నాలుగు వారాలపాటు బయటపెట్టవద్దని ఏఎస్ఐ బుధవారం కోర్టును కోరిందని హిందూ పక్షం న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు.
ఏఎస్ఐ విజ్ఞప్తి అనంతరం ఈ కేసుపై విచారణను గురువారానికి వాయిదా వేశారు. అయితే గురువారం జిల్లా జడ్జి ఏ కే విశ్వేష్ వేరొక కార్యక్రమానికి హాజరుకావడంతో, శుక్రవారానికి వాయిదా వేశారు.