హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణ ఇండియన్ ఎకనమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ఐఈటీవో) ట్రేడ్ కమిషనర్గా నియమితులయ్యారు. లాటిన్ అమెరికన్ కంట్రీ ఈక్వెడార్.. హైదరాబాద్లో ఆరు రాష్ర్టాలకు కలిపి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్) ట్రేడ్ డెస్క్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ డెస్క్కు కమిషనర్గా ఆయన నియమితులయ్యారు. తనను ట్రేడ్ కమిషనర్గా నియమించడంపై జీవీ కృష్ణ సంతోషం వ్యక్తంచేశారు. జీవీ కృష్ణకు తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఈక్వెడార్ అంబాసిడర్ హెక్టార్, బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూఫ్లెమింగ్, సౌత్ కొరియా గౌరవ కాన్సులేట్ సురేశ్, టర్కీ రాయబారి అద్నాన్ ఆర్డినోర్స్, మౌలానా ఆజాద్ వర్సిటీ చాన్స్లర్ ఫిరోజ్ భక్త్ అహ్మద్ అభినందనలు తెలిపారు.