న్యూఢిల్లీ: అమెరికాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి(Indian Student) మృతిచెందాడు. అయితే అతన్ని మర్డర్ చేసి ఉంటారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరి.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆ విద్యార్థి పేరెంట్స్ పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మీ బోరునా కనెక్టికట్లో ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కుమారుడిని చంపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మార్చి 11వ తేదీన యూనివర్సటీ క్యాంపస్లో హత్య చేశారని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని సమీప అడవుల్లో కారులో వదిలేశారన్నారు. ఫ్రెండ్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఫాలోఅయ్యారు. దాని ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించారు. భారతీయ విద్యార్థి మృతి వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో విచారణ చేపట్టామని భారతీయ కౌన్సులేట్ పేర్కొన్నది. కానీ తమకు ఎటువంటి అనుమానం రాలేదని కౌన్సులేట్ తెలిపింది. ఏపీలోని స్వంత గ్రామంలో పరుచూరి అభిజిత్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో ఇప్పటి వరకు 9 మంది భారతీయ విద్యార్థులు మృతిచెందడం శోచనీయం.
Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston.
Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered…
— India in New York (@IndiainNewYork) March 18, 2024