గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి బెయిల్ దొరికింది. అంతలోనే మరో కేసులో అసోం పోలీసులు ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో అరెస్ట్ చేశారు. అయితే… ఆయన్ను తిరిగి ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది మాత్రం తెలియరాలేదు. అయితే… ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డు తగిలారన్న అభియోగంపై ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కేంద్రంపై జిగ్నేశ్ మేవానీ విరుచుకుపడ్డారు. ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర అంటూ మండిపడ్డారు. తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఇలా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పద్ధతి ప్రకారం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రోహిత్ వేముల, ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, ఇప్పడు తనను ఇబ్బందులు పెడుతున్నారని మేవానీ వివరించారు.
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి అసోం కోర్టు బెయిల్ మంజూరైంది. జిగ్నేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నిన్న కోర్టు విచారించినప్పటికీ, తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇవాళ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.
ఎమ్మె ల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు గత వారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ అస్సాంలో దాఖలైన కేసులో బుధవారం రాత్రి 11.30 గంటలకు పాలంపూర్లో అదుపులోకి తీసుకొని అసోం తరలించారు.