గాంధీనగర్: కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురి కాలేజీ ఫీజు కట్టలేకపోవడంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అయితే ఇప్పుడు ఇది రాష్ట్రంలో రాజకీయ వేడిగిన రగులుస్తున్నది. అధికర బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 21వ శతాబ్ధంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు.