అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈ నెల 25 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రటకన చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే, రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ ఎనిమిది నగరాల్లో వడోదర, గాంధీనగర్, సూరత్, రాజ్కోట్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలావుంటే ఏపీలో ఇవాళ కొత్తగా 1125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974కు పెరిగింది.