అహ్మదాబాద్ : గుజరాత్లో ప్రభుత్వం నైట్కర్ఫ్యూను వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 27 నగరాల్లో వైరస్ కట్టడికి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు చేస్తున్నది. కొవిడ్పై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నైట్కర్ఫ్యూను పొడిగించాలని సీఎం నిర్ణయించారు. గుజరాత్లో రోజువారీ కొవిడ్ కేసులు తగుతున్నా.. నిన్న 12,131 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతవారం ప్రభుత్వం ఎనిమిది మెట్రోనగరాలతో పాటు.. 19 నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మెట్రోనగరాల జాబితాలో అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్, జామ్నగర్, జునాగఢ్, భావ్నగర్, గాంధీనగర్ ఉన్నాయి. శనివారంతో గడువు ముగుస్తుండగా.. వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.