సురేంద్రనగర్: బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్కు .. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2017 నాటి కేసులో కోర్టుముందు హాజరుకావడం లేదని జిల్లాకోర్టు హార్దిక్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయన అతిక్రమించినట్లు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఓ గ్రామంలో పటేల్ రాజకీయ ప్రసంగం చేశారు. ఆ కేసులో జిల్లా అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ డీడీ షా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ధరగంద్ర తాలూక పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
పటేల్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుచాలని మెజిస్ట్రేట్ అక్కడి పోలీసులకు ఆదేశించారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆ పోలీసు స్టేషన్కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.