గాంధీనగర్, జనవరి 30: మహిళపై లైంగికదాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపును గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అహ్మదాబాద్ నగర శివారులోని అతడి ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో లైంగికదాడికి పాల్పడినట్టు బాధిత మహిళ 2013లో ఆసారాం బాపుపై చాంద్ఖేడా ఠాణాలో ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో అతడికి మరో ఆరుగురు సహకరించినట్టు పేర్కొన్నది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆసారాం బాపును దోషిగా నిర్ధారించింది. ఆసారాం భార్యతో పాటు ఐదుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. మరో రేప్ కేసులో ఆసారాం ఇప్పటికే జోద్పూర్ జైలులో ఉన్నారు. ఆసారాంకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు.