అహ్మదాబాద్: కరోనా టీకా వేసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు పలు సంస్థలు రకరకాల స్కీమ్లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్లోని అమ్వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) పండుగ నేపథ్యంలో ఒక ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకునే వారికి లీటర్ వంట నూనె ప్యాకెట్తోపాటు లక్కీ డ్రా కూపన్ అందిస్తున్నది. దీంతో స్థానికులు టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
కాగా, వంద శాతం టీకా లక్ష్యాన్ని సాధించడంతోపాటు పేద, మురికివాడల్లోని ప్రజలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు ఈ మేరకు చొరవ చూపినట్లు అమ్వాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వైద్య అధికారి డాక్టర్ రజనీకాంత్ హేమరాజ్ తెలిపారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి టీకా పొందుతున్నారని చెప్పారు. లక్కీ డ్రాలో గెలిచిన 25 మందికి రూ.10,000 విలువైన బహుమతులు ఇస్తామని ఆయన వెల్లడించారు.