భోపాల్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కోటలో ఉన్న తబలా దర్బార్లో సోమవారం ఏకకాలంలో 1,600 మంది తబలా వాయించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్వాలియర్ వార్షిక సంగీత ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కోటను నిర్మించిన రాజా మాన్ సింగ్ గొప్పతనంతోపాటు సాంస్కృతిక చరిత్ర ఘనతను చాటే విధంగా ఈ కార్యక్రమం జరిగిన కర్ణ మహల్ను అలంకరించారు. ఉష్ణోగ్రత 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉన్న సమయంలో ఆరు బయట తబలా వాయించడం చాలా కష్టం అయినప్పటికీ, వాద్యకారులు నిరాశ చెందకుండా, ప్రపంచ రికార్డును సృష్టించడం ప్రశంసనీయం.