ముంబై: హిందూ సాంప్రదాయ క్యాలెండర్లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదేరోజును ఉగాది అంటారు. ఉదయాన్నే దైవారాధన, మామిడాకుల తోరణాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, బక్షాలు, పంచాంగం శ్రవణం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ప్రత్యేకతలు.
అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే పండుగను గుడిపడ్వగా జరుపుకుంటారు. గుడిపడ్వ రోజున ప్రజలు నూనె స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, పూజలు చేస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడుతారు. ఇంటిముందు అందమైన రంగోళీలు వేస్తారు. ఆ తర్వాత వీధుల్లో ఉత్సవాలు మొదలవుతాయి. ప్రజలు సాంప్రదయ దుస్తులు ధరించి బ్యాండు మేళాలు, భజన పాటలు, నృత్యాలతో సంబురాలు చేసుకుంటారు.
2020లో కరోనా మహమ్మారి విస్తరణతో గత మూడేండ్లుగా గుడిపడ్వ ఉత్సవాలను పూర్తిస్థాయిలో జరుపుకోలేకపోయారు. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా వేడుకలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, నాగ్పూర్ నగరాల్లో గుడిపడ్వ సంబురాలకు సంబంధించిన పొటోలను ఈ కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Maharashtra: Gudi Padwa is being celebrated in the state. Visuals of vibrant celebrations from Mumbai. pic.twitter.com/wLHdRDUvyP
— ANI (@ANI) March 22, 2023
#WATCH | Maharashtra: Gudi Padwa is being celebrated. Visuals of vibrant celebrations from Nagpur pic.twitter.com/Zn2UnHapKF
— ANI (@ANI) March 22, 2023