ఢిల్లీ , మే 29; కరోనా ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్కీలక నిర్ణయం తీసుకున్నది. కోవిడ్ ప్రోడక్ట్స్ పై దిగుమతి సుంకానికి సంబంధించి ఊరట కల్పించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ ఈరోజు భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అయితే, కరోనా మెడిసిన్స్, వ్యాక్సీన్స్, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం నిర్మలమ్మ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ఈ భేటీలో ముఖ్యంగా కరోనా సంబంధిత వస్తువులపై పన్ను అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సీతారామన్ తెలిపారు.ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు కొనసాగుతుందన్నారు. మినహాయింపు జాబితాలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్-బి ఔషధాన్ని చేర్చామన్నారు.పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.