న్యూఢిల్లీ: గర్భిణులు పీచు పదార్థం తీసుకోకపోతే గర్భస్థ శిశువు మెదడు కణాల ఎదుగుదల ఆలస్యం అవుతుందని జపాన్ పరిశోధకులు గుర్తించారు. ‘యూనివర్సిటీ ఆఫ్ యమనాశి’ పరిశోధకుల అధ్యయనాన్ని ‘జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ నూట్రిషిన్’ ప్రచురించింది.
గర్భిణి తీసుకునే ఆహారంలో పీచు పదార్థం తక్కువైతే.. వారి పిల్లలు పూర్తిస్థాయిలో నైపుణ్యాల్ని కనబర్చలేరని తేలింది. పీచు ఎక్కువ తీసుకున్న, తక్కువ తీసుకున్న తల్లుల పిల్లలపై అధ్యయనం జరిపినట్టు పరిశోధకుడు మియాకీ తెలిపారు.