బర్హంపూర్, మార్చి 17: పెండ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఇక పెండ్లి కొడుకు పెండ్లికూతురు ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలి.. ఇందుకోసం నాలుగు కార్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతలోనే డ్రైవర్లు సమ్మెకు దిగారు.. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి.. అటు పెండ్లికూతురు తరఫువాళ్లు ఎదురుచూస్తున్నారు.. ఇటు వాహనాలు లేవు.. ఇక చేసేదేమీ లేక కాలిబాట పట్టాడు పెండ్లి కొడుకు. దాదాపు 28 కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రంతా నడిచి పెండ్లికూతురు ఇంటికి చేరుకున్నాడు. అనుకున్నట్టే పెండ్లి జరుగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది.