న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తక్కువ స్థాయిలో టీడీఎస్ ఉండే వాటర్ ఫ్యూరిఫయర్ల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది. నీటిలో కరిగిన మొత్తం ఘనపదార్థాల(టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్-టీడీఎస్) స్థాయి లీటర్కు 500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండే వాటర్ ఫ్యూరిఫయర్లను నిషేధిస్తూ ఆర్వో తయారీదారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)ని ఎన్జీటీ ఆదేశించింది. క్యాట్రిడ్జ్లతో పాటు ఆర్వో రిజెక్ట్స్ల నిర్వహణపై కూడా మార్గదర్శకాలు ఇవ్వాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని సెక్షన్ 5 కింద అన్ని ఆర్వో తయారీదారులకు సీపీసీబీ తగిన ఆదేశాలు ఇవ్వాలని, ఒక నెలలోగా అవి అమలయ్యేలా చూడాలని బెంచ్ ఈ సందర్భంగా స్పష్టంచేసింది.