(ఎడ్యుకేషన్ డెస్క్) ;విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష జీఆర్ఈ. ఏటా సుమారు లక్షమందికి పైగా రాసే ఈ పరీక్షలో కొన్ని ప్రధానమైన మార్పులను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పుల గురించి సంక్షిప్తంగా..
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (జీఆర్ఈ) పరీక్ష ప్రధానమైంది. దీన్ని ఈటీఎస్ నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్, స్టెమ్, బిజినెస్ స్కూల్స్, లా వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ స్కోర్ను పరిగణనలోకి తీసుకుని మాస్టర్స్లో ప్రవేశాలు కల్పిస్తాయి.