న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏదో కారణంతో తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నారంటూ టెలికం విభాగం చర్యలపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇంటర్నెట్ షట్డౌన్ చేసేందుకు కారణమైన సంఘటనలకు సంబంధించిన రికార్డులను నిర్వహించకపోవడం, తమ అనేక సిఫార్సులపై పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘టెలికం సేవలు, ఇంటర్నెట్ సస్పెన్షన్, దాని ప్రభావం’పై తమ అధ్యయనాన్ని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ సస్పెన్షన్ నిబంధనలను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు హోం మంత్రిత్వ శాఖతో కలిసి స్పష్టమైన విధానాలను రూపొందించాలని డీవోటీని ప్యానెల్ కోరింది.
అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గితేనే దేశంలోని ప్రజలకు సబ్సిడీని అందజేస్తామని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ ‘అంతర్జాతీయంగా వంట గ్యాస్ ధర రోజురోజుకూ పెరుగుతున్నది. దీని ప్రభావం వల్ల దేశంలో గ్యాస్ ధరలను కొంతవరకే పెంచాం. దేశానికి అవసరమైన గ్యాస్లో దాదాపు 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని పేర్కొన్నారు.
దేశంలో 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వారిలో గత ఏడాదే 2.5 లక్షల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది.