న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ‘డీప్ఫేక్’ సమస్యపై త్వరలోనే సామాజిక మాధ్యమాలతో సమావేశం కానున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీప్ఫేక్ కంటెంట్ను తొలగించడానికి సామాజిక మాధ్యమాలు తగిన చర్యలు తీసుకోకపోతే వారికి సురక్షిత హార్బర్ క్లాజ్ వర్తించదని చెప్పారు. .
ఈ సమస్య నివారణకు ఇప్పటికే అవి కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని, అయితే అది సరిపోదని.. మరింత కఠిన చర్యలు అవసరమని తాము భావిస్తున్నామన్నారు. దాంతో ఈ విషయంపై మూడు నాలుగు రోజుల్లో చర్చలు జరపనున్నట్టు చెప్పారు.