లక్నో: రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో రైతు కుటుంబాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ గాంధీ అధికారంలో ఉన్న సొంత పార్టీపై మరోసారి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కానీ పోలీసులు, మైనింగ్ యజమానులతోపాటు ఇతరుల నుంచి డబ్బులు తీసుకునే కొందరు నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు.
తాను ఎంపీ జీతం కూడా తీసుకోవడం లేదని, అధికార నివాసంలో ఉండటం లేదని వరుణ్ గాంధీ తెలిపారు. ప్రజలు తనకు అధికారం ఇచ్చింది తాను ఎదిగేందుకు కాదని, ప్రజల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసమని ఆయన అన్నారు.