గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం… ఇప్పుడు కాస్త సడలింపు ఇచ్చింది. గోధమల కన్సైన్మెంట్లను పరీక్షల కోసమో, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13 లేదా అంతకంటే ముందు అప్పగిస్తే, అలాంటి వాటిని ఎగుమతి చేయడానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.
ఇక ఈజిప్ట్కు వెళ్లే కన్సైన్మెంట్కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఇవి కండ్లా నౌకాశ్రయంలో డౌన్లోన్ అవుతోంది. ఈజిప్టు సర్కార్తో పాటు ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజ్ఞప్తి చేయడంతోనే ఈ కన్సైన్మెంట్కు కేంద్రం ఓకే చెప్పింది.