న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముస్లిం, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో సభ్యులుగా మాజీ ఐఏఎస్ డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ ప్రొఫెసర్ సుష్మా యాదవ్ను నియమించింది.
ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ హోదా కల్పించటంపై నిర్ణయం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ కమిషన్ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వొచ్చా? లేదా? అన్నదానిపై అధ్యయనం చేస్తుంది. కాగా, రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్స్-1950 ఆదేశాల ప్రకారం.. హిందూ, బౌద్ధం, సిక్కు మతాల్లోని దళితులనే ఎస్సీలుగా గుర్తిస్తున్నారు.