న్యూఢిల్లీ : కరోనాపై పోరాటంలో 12-18 సంవత్సరాల మధ్య పిల్లలకు మరో టీకా అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-అ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ త్వరలోనే ఆమోదం లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం కంపెనీ తయారు చేసిన టీకాకు డీసీజీఐ ఆమోదం తెలిపింది.
అయితే, ఇంకా టీకా డ్రైవ్లో చేర్చలేదు. కరోనాకు వ్యతిరేకంగా భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఆర్బీడీ (RBD) ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇది. ఇటీవల కంపెనీ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నది. ఈ మేరకు నిపుణుల కమిటీ దరఖాస్తుపై సోమవారం చర్చించి.. కంపెనీ సమర్పించిన డేటాతో సంతృప్తి చెందగా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి సిఫారు చేసింది. గతేడాది అక్టోబర్లో బయోలాజికల్ 5 నుంచి 18ఏళ్ల చిన్నారులపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
పిల్లల కొవిడ్ టీకాలకు సంబంధించి సురక్షిత, రోగనిరోధకత ఫలితాలను విశ్లేషించగా మెరుగైన ఫలితాలు కనిపించినట్లు బయోలాజికల్ ఈ ప్రతినిధి శ్రీనివాస కొసరాజు ఇటీవల పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కార్బివాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో డోసును రూ. 145 (జీఎస్టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ టీకాను ఎవరికి అందిస్తారన్న దానిపై స్పష్టతలేనప్పటికీ ప్రికాషినరీ డోసుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.