న్యూఢిల్లీ: ఇకపై కొత్త వాహనాలు భారత్ సిరీస్ (BH-సిరీస్)తో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీంతో వాహన యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు వారి వ్యక్తిగత వాహనానికి కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కేటాయించాల్సిన అవసరం ఉండదు. దీంతో తమ వాహనంలో దేశంలో ఎక్కిడికైనా ప్రయాణించవచ్చు. ఇలాంటి సౌలభ్యమున్న భారత్ సిరీస్ రిజిష్ట్రేషన్ను కొత్త వాహనాలకు ప్రవేశపెట్టినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించింది.
అయితే భారత్ సిరీస్ కింద వాహనాల రిజిస్ట్రేషన్ స్వచ్ఛంద ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని తెలిపింది. రక్షణ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్/స్టేట్ పీఎస్యూలు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు, సంస్థల ఉద్యోగులు స్వచ్ఛంద ప్రాతిపదికన తమ వ్యక్తిగత వాహనాలకు భారత్ సిరీస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది.