న్యూఢిల్లీ, మార్చి 23: రాష్ర్టాలకు గ వర్నర్లను నియమించే సమయం లో ముఖ్యమంత్రులతో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఏఐఏడీఎంకే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అలా గే ‘నీట్’ పరీక్షను రద్దు చేస్తామని, వై ద్య విద్యార్థుల ఎంపిక కోసం ప్రత్యామ్నాయ ప్రక్రియను చేపడతామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీ ఎం, ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి పార్టీ మ్యానిఫెస్టోని చె న్నైలో విడుదల చేశారు. సుప్రీంకోర్టు బెంచ్ను చెన్నైలో ఏర్పాటుచేస్తామ ని, భారత్లో నివసిస్తున్న శ్రీలంక శ రణార్థులకు ద్వంద్వ పౌరసత్వం జా రీ చేస్తామని..ఇలా 113 హామీలను ఓటర్ల ముందుంచింది. దాదాపు ఇ వే అంశాలతో డీఎంకే మ్యానిఫెస్టో ను ఇటీవల విడుదల చేసింది.