చెన్నై: ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ వద్దకు వెళ్లిన టీవీకే చీఫ్ విజయ్కు ఊహించని షాక్ తగిలింది. తగినంత మెజారిటీ చూపించలేదని.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు. బుధవారం లోక్భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ తనకు మద్దతు ఇచ్చిందని, వారి పేర్లతో కూడిన జాబితాను గవర్నర్కు వివరించారు. అయితే విజయ్ వాదనపై గవర్నర్ ఆర్లేకర్ పూర్తి సంతృప్తి చెందలేదు. విజయ్ను ఆహ్వానించటంపైనా, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించటంపైనా అధికారిక నిర్ణయమేదీ తీసుకోలేదని లోకభవన్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు డీఎంకేతో జతకట్టిన కాంగ్రెస్, ఫలితాల తర్వాత మిత్రపక్షాన్ని వీడి టీవీకే పంచన చేరటం తమిళనాట చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో ఆరుగురి ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు అవసరం. మద్దతు ఇస్తాయని భావించిన వీసీకే (2), వామపక్షాలు(4), ఐయూఎంఎల్(2) ముందుకు రాలేదు.