న్యూఢిల్లీ: బిపిన్ రావత్, మధూలిక, 11 మంది సైనికుల మృతదేహాలను గురువారం రాత్రి ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్కు తరలించారు. రావత్ దంపతుల అంత్యక్రియలను శుక్రవారం బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ప్రజల కోసం ఉదయం 11 గంటల నుంచి వారి పార్థివ దేహాలను సందర్శనకు ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సైనికాధికారులను అనుమతిస్తారు. 2 గంటలకు రావత్ దంపతుల అంతిమ యాత్ర కామరాజ్ మార్గ్ 3వ నంబర్ బంగ్లా నుంచి ప్రారంభం అవుతుంది. పూర్తి సైనిక లాంఛనాలతో రావత్ అంత్య క్రియలు నిర్వహిస్తామని రాజ్నాథ్ పార్లమెంటులో ప్రకటించారు.