న్యూఢిల్లీ : ఒక అంచనా ప్రకారం దేశంలో గుర్తించదగిన వారసత్వ కట్టడాలు 5 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వాలు సంరక్షిస్తున్నది 8,193 మాత్రమే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన 340వ నివేదికలో ఈ పచ్చి నిజాన్ని బయటపెట్టింది.చారిత్రక, వారసత్వ కట్టడాల రక్షణ విషయంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కమిటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్నది 3,693 కట్టడాలేనని తెలిపింది. అన్ని రాష్ర్టాలు కలిపి 4,500 కట్టడాలను సంరక్షిస్తున్నట్టు వెల్లడించింది.