న్యూఢిల్లీ, జూలై 23: స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగుర వేసేందుకు సర్వం సిద్ధమవుతున్నది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజులపాటు రేయింబవళ్లు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడేందుకు వీలుగా కేంద్ర సర్కారు నిబంధనలను సవరించింది.
స్వాత్రంత్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, జాతీయ పతాకాన్ని ఉదయం ఎగురవేస్తే సూర్యాస్తమయంలో తీయాల్సి ఉంటుంది. జెండాను ఎగురవేసే ఫ్లాగ్కోడ్ నిబంధనల్లో ‘హర్ఘర్ తిరంగా’ కార్యక్రమం కోసం మార్పులుచేసింది.