న్యూఢిల్లీ : ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ విలేకరులతో సమావేశంలో వెల్లడించారు. ఆయా చానెల్స్ను 12 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని, మిలియన్లలో వ్యూస్ ఉన్నాయి.
ఆయా మార్గాల్లో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, ఆయా చానల్స్, ఖాతాల నిర్వహణ పాక్ నుంచి జరుగుతోందని.. దేశ వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తున్నాయని విక్రమ్ సహాయ్ చెప్పారు. గతేడాది డిసెంబర్లో సైతం భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానల్స్, రెండు వెబ్సైట్లను బ్యాన్ చేశారు. దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వెబ్సైట్లు, యూట్యూబ్ చానల్స్పై చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.