మంగళూరు, డిసెంబర్ 3: కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మంది భారత ఇంజినీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు. భారత ఇంజినీర్లు తమ డిగ్రీకి సంబంధించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ను సమర్పించాలంటూ ఆ దేశ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
వాస్తవానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ సర్టిఫికెట్ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్తో సమానం)ను భారత్లోని యూనివర్సిటీలు ఇవ్వవు. డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్నవారికి మాత్రమే ఈ సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఇది గుర్తించని కువైట్ అధికారులు భారత ఇంజినీర్లను వేధిస్తున్నారు. దీంతో వీరంతా కువైట్లోని భారత ఎంబసీని సంప్రదించినా ఫలితం లేకుండా పోతున్నది.