Sundar Pichai | న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దిగ్గజ కంపెనీ గూగుల్లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇది పని ప్రదేశమని, వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలు, ఇతర పలు అంశాలకు సంబంధించి కంపెనీని వ్యక్తిగత వేదికగా వినియోగించొద్దని, ఇతర ఉద్యోగుల్లో అభద్రతా భావం కలిగించొద్దని ఆయన తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు.
గూగుల్ సంస్థ ఇజ్రాయెల్తో పనిచేస్తున్నదని ఆరోపిస్తూ కొన్ని గంటలపాటు ధర్నా చేసిన తొమ్మిది మంది సంస్థ ఉద్యోగులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాతి రోజున ఈ ఆందోళనకు సంబంధించి 28 మందిని ఉద్యోగాల నుంచి సంస్థ తొలగించింది.